Welcome to Sunshine Smart City – Near KIA Motors, Penukonda
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విమానాల తయారీ కేంద్రాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. దీన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ (Embraer)తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ కూడా పోటీ పడుతోంది. అయితే, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల అనంతపురం జిల్లా విమాన తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన SIPB సమావేశంలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్లాంట్, విశాఖలో టీసీఎస్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు విమానయ